ప్రపంచ క్రికెట్లో అత్యంత విజయవంతమైన బ్యాటర్లలో ఒకరిగా నిలిచిన విరాట్ కోహ్లీ ప్రయాణం ఓ సాధారణ దేశవాళీ టీ20 మ్యాచ్తోనే ప్రారంభమైంది. ప్రస్తుతం అభిమానులను తన బ్యాటింగ్తో ఉర్రూతలూగిస్తున్న కోహ్లీ.. 2006-07 సీజన్లో దిల్లీ తరఫున హిమాచల్ ప్రదేశ్పై తొలి దేశవాళీ టీ20 మ్యాచ్ ఆడాడు. అప్పటికి అతని వయసు కేవలం 18 ఏళ్లు మాత్రమే.
బ్యాటింగ్కు పెద్దగా అనుకూలం కాని పిచ్పై వన్డౌన్లో బరిలోకి దిగిన కోహ్లీ.. అనుభవజ్ఞులైన బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. 26 బంతుల్లో 35 పరుగులు చేసి జట్టులో రెండో అత్యధిక స్కోరర్గా నిలిచాడు. శిఖర్ ధావన్ 38 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో దిల్లీ 136 పరుగులకే పరిమితమైంది. అనంతరం హిమాచల్ ప్రదేశ్ మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది.
మ్యాచ్లో దిల్లీ ఓడిపోయినా కోహ్లీ ఆట మాత్రం సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది. అదే ప్రదర్శన అతడికి 2008 ఐపీఎల్ డ్రాఫ్ట్లో చోటు దక్కేలా చేసింది. ఆసక్తికరంగా, స్థానిక ఆటగాడైన కోహ్లీని దిల్లీ ఫ్రాంచైజీ ఎంపిక చేయలేదు. కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం అతడిలోని ప్రతిభను గుర్తించి తమ జట్టులోకి తీసుకుంది.
అదే ఏడాది కోహ్లీ సారథ్యంలో భారత్ అండర్-19 ప్రపంచకప్ గెలవడంతో అతడి కెరీర్ మరింత ఊపందుకుంది. అప్పటి నుంచి ఆర్సీబీతో విడదీయరాని బంధాన్ని కొనసాగిస్తున్న కోహ్లీ.. ఫ్రాంచైజీకి ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. దేశవాళీ టీ20లో 35 పరుగులతో ప్రారంభమైన అతడి ప్రయాణం.. నేడు ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరిగా నిలిచే స్థాయికి తీసుకెళ్లింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















