అవతార్ ఫ్రాంచైజీలో భాగంగా వచ్చిన మూడో చిత్రం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ కథ మరింత భావోద్వేగం, యాక్షన్తో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. రెండో భాగం ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’లో జరిగిన సంఘటనల తర్వాత జేక్ సల్లీ మరియు నేత్రి తమ పెద్ద కుమారుడిని కోల్పోయిన బాధలో ఉంటారు. ఆ దుఃఖంతోనే వారు తమ ఇతర పిల్లలతో కలిసి పండోరా గ్రహంలో జీవితం కొనసాగిస్తుంటారు.
ఈ సమయంలో జేక్ సల్లీపై ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో కల్నల్ మళ్లీ నావీ రూపంలో జీవం పోసుకుని తిరిగి వస్తాడు. అతని లక్ష్యం సల్లీ కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేయడమే. ఇందుకోసం అతను అగ్ని తెగకు చెందిన శక్తివంతమైన నాయకురాలు వరంగ్తో చేతులు కలుపుతాడు.
వరంగ్కు సల్లీ కుటుంబం విశ్వసించే ఈవా దేవతపై తీవ్రమైన కోపం ఉంటుంది. ఈ నేపథ్యం వారి మధ్య మరింత ద్వేషాన్ని పెంచుతుంది. ఇద్దరూ కలిసి సల్లీ కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవడానికి పథకాలు రచిస్తారు.
ఇక పండోరా గ్రహంలో ఈ యుద్ధం తీవ్ర రూపం దాల్చుతుంది. కుటుంబాన్ని రక్షించుకోవడానికి జేక్ సల్లీ ఎలా పోరాడాడు? శత్రువుల ప్రణాళికలను ఎలా ఎదుర్కొన్నాడు? ఈ పోరాటాలు పండోరా భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపాయి? అనే అంశాలు కథలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
ఈ ఉత్కంఠభరితమైన కథను తెలుసుకోవాలంటే ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ చిత్రాన్ని చూడాల్సిందే. ఈ సినిమా బుధవారం నుంచి జియోహాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















