2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై జరిగిన హమాస్ దాడుల సూత్రధారుల్లో ఒకరైన మహమ్మద్ బడెహ్ను ఇజ్రాయెల్ సైన్యం (IDF) మట్టుబెట్టింది. గాజా నగరంపై మంగళవారం రాత్రి జరిగిన వైమానిక దాడుల్లో ఆయన సహా ముగ్గురు మరణించగా, 12 మంది గాయపడ్డారు.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, రక్షణ మంత్రి యోవ్ గాలంట్ (Katz) ఈ ఆపరేషన్ను ధ్రువీకరించారు. అక్టోబర్ 7 మారణహోమంలో పాల్గొన్న ప్రతి హమాస్ నేతను లక్ష్యంగా చేసుకుంటామని వారు స్పష్టం చేశారు.
ఇటీవల హమాస్ మిలిటరీ విభాగానికి నాయకత్వం వహించిన ఎజ్జెదిన్ అల్ హద్దాద్ మరణించడంతో, అతని స్థానంలో మహమ్మద్ ఒడెహ్ బాధ్యతలు స్వీకరించినట్లు సమాచారం. అయితే బాధ్యతలు చేపట్టిన 11 రోజుల్లోనే అతను కూడా ఇజ్రాయెల్ దాడుల్లో హతమయ్యాడు.
ఈ ఘటనపై హమాస్ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో గాజాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
2023 అక్టోబర్ 7న హమాస్ దాడుల్లో సుమారు 1,200 మంది ఇజ్రాయెలీయులు ప్రాణాలు కోల్పోగా, 250 మందికి పైగా బందీలుగా తీసుకెళ్లబడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇజ్రాయెల్ గాజాలో విస్తృత సైనిక ఆపరేషన్ కొనసాగిస్తోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















