కర్ణాటకలోని బళ్లారిలో ఒక ప్రైవేట్ పాఠశాల హాస్టల్లో సంచలన ఘటన చోటుచేసుకుంది. నిద్రిస్తున్న తోటి విద్యార్థులపై ఓ విద్యార్థి చాకు, ఇనుప కడ్డీతో దాడి చేయడంతో ఒకరు మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
నిద్రలో ఉన్న విద్యార్థులపై దాడి
బళ్లారిలోని ఓ ప్రైవేట్ ఇంటర్నేషనల్ పాఠశాల హాస్టల్లో మొత్తం తొమ్మిది మంది విద్యార్థులు, వార్డెన్ ఉంటున్నారు. శనివారం రాత్రి సుమారు 10.15 గంటల సమయంలో విద్యార్థులు గదిలో నిద్రిస్తున్న సమయంలో ఒక విద్యార్థి అకస్మాత్తుగా ఇనుప కడ్డీ, చాకు పట్టుకుని గదిలోకి వచ్చి తోటి విద్యార్థులపై దాడికి దిగాడు. దాడిలో హేమంత్ (15), వినయ్కుమార్ రెడ్డి (15), ఇస్మాయిల్ (10), మనోజ్ ప్రసాద్ (10), రక్షిత్ (15), విష్ణు (12) తీవ్రంగా గాయపడ్డారు.
అడ్డుకునేందుకు వచ్చిన వారిపైనా దాడి
విద్యార్థుల అరుపులు విని వార్డెన్తో పాటు ఉపాధ్యాయిని బ్లెస్సీ, విద్యార్థిని శశికళ అక్కడికి చేరుకున్నారు. అయితే దాడి చేసిన విద్యార్థి వారిపైనా దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు.
చికిత్స పొందుతూ విద్యార్థి మృతి
గాయపడిన వారిని హాస్టల్ యాజమాన్యం వెంటనే ఆసుపత్రికి తరలించింది. అయితే తీవ్రంగా గాయపడిన హేమంత్ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
కేసు నమోదు.. నిందితుడి కోసం గాలింపు
ఈ ఘటనపై బ్రూస్పేటె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారైన నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మృతిచెందిన హేమంత్ ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా కోలగుండ మండలం సమ్మతగిరి గ్రామానికి చెందినవాడని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో విద్యార్థుల భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















