కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) మరోసారి చక్రం తిప్పబోతోందా.. అంటే అవుననే సమాధానమే వస్తోంది. యూడీఎఫ్ అధికారం సాధించాలంటే లీగ్ మద్దతు ఎంతో కీలకం. మలబార్ ప్రాంతంలో అది నిర్ణయాత్మక శక్తిగా ఉంది. పి.కె.కున్హల్కుట్టి ఆ పార్టీ కీలక వ్యూహకర్తగా ఉన్నారు. సంకీర్ణ రాజకీయాలను బ్యాలెన్స్ చేయడంలో, కమ్యూనిటీల మద్దతు కూడగట్టడంలో, సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్తో కలిసి ఉండటంలో ఆయనదే కీలక పాత్ర. మలబార్లోని మలప్పురంలో ఐయూఎంఎల్ బలంగా ఉన్నప్పటికీ.. ఇటీవల హిందూ మతపరమైన కార్యక్రమాలకు కేరళ కుంభ్ అని పేరు పెట్టడం, అక్కడ హిందుత్వ కార్యకలాపాలు పెరగడంతో స్పష్టమైన విభజన కనిపిస్తోంది.
నమ్మకమైన భాగస్వామి
చిన్న చిన్న భాగస్వాముల్లా కాకుండా ఐయూఎంఎల్ యూడీఎఫ్కు నమ్మకమైన భాగస్వామిగా ఉంది. మలబార్ ప్రాంతంలో ఇది గణనీయంగా ఓట్లు, సీట్లు సాధించగలుగుతుంది. ఎల్డీఎఫ్తో జరిగే హోరాహోరీ పోరులో ఫలితాలను తారుమారు చేయగలుగుతుంది. ఆ ప్రాంతంలో విద్యా సంస్థలు, సామాజిక సేవ ద్వారా ప్రభావం చూపుతూ స్థిరమైన ఫలితాలను సాధిస్తూ వస్తోంది. తద్వారా అధికార యూడీఎఫ్తో గట్టిగానే బేరాసారాలాడుతోంది.
ఆయనే వెన్నెముక
ఐయూఎంఎల్ సీనియర్ నేతగా ఉన్న పి.కె.కున్హల్కుట్టి.. ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారానే కాకుండా పార్టీకి వెన్నెముకలా ఉంటారు. కాంగ్రెస్తోనూ మంచి సంబంధాలను కలిగి ఉంటారు. కరుణాకరన్, ఊమెన్ చాందీ ప్రభుత్వాల్లో క్యాబినెట్ మంత్రిగా పని చేశారు. 1982 నుంచి ఆయన మలప్పురం నుంచి గెలుస్తూ వస్తున్నారు. ఒక్కసారి మాత్రమే ఓడిపోయారు.
20 సీట్లలో ఆధిక్యం!
కేరళ అసెంబ్లీలో 140 సీట్లున్నాయి. మెజారిటీ మార్కు 71. పలు సర్వేల్లో రెండు కూటముల మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని తేలింది. ఈ నేపథ్యంలో ఐయూఎంఎల్కు పట్టున్న 20 సీట్లు అధికారం సాధించడంలో ఎంతో కీలకం కానున్నాయి. ఆ పార్టీ 25 సీట్లలో పోటీ చేస్తుంటుంది. ప్రతి ఎన్నికల్లోనూ సగటున 18 నుంచి సీట్లను గెలుస్తుంది. దాని స్ట్రైక్ రేటు 80శాతంగా ఉంటుంది. కాంగ్రెస్ స్ట్రైక్ రేటు 50 శాతంలోపే ఉంటుంది.
- 2016లో పోటీ చేసిన 87 సీట్లలో 22 చోట్లే కాంగ్రెస్ గెలిచింది. అదే ఐయూఎంఎల్ 24 సీట్లలో పోటీ చేసి 18 చోట్ల నెగ్గింది.
- 2021లో 22 సీట్లలో కాంగ్రెస్ గెలిచింది. ఐయూఎంల్ 15 చోట్ల విజయం సాధించింది.
చివరి పోలికలు
2016లో 87 సీట్లలో కాంగ్రెస్ 22 సీట్లు గెలిచింది, ఐయూఎంఎల్ 24 సీట్లలో 18 సీట్లు గెలిచింది. 2021లో కాంగ్రెస్ 22 సీట్లు, ఐయూఎంఎల్ 15 సీట్లు గెలిచింది.ఒక సారస్వత నిమిష విశ్లేషణ ప్రకారం, మలబార్ ప్రాంతం మరియు IUML విజయాలు UDF విజయం సాధించడంలో నిర్ణయాత్మకంగా ఉంటాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews


















