ప్రపంచానికి భారత్ విశ్వసనీయ భాగస్వామిగా వేగంగా ఎదుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వృద్ధి, ఆవిష్కరణలు, కొత్త అవకాశాలను భవిష్యత్ తరాలకు అందించే రంగాల్లో భారత్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోందని ఆయన తెలిపారు.
ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ గురువారం పారిస్లో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతి దేశం విశ్వసనీయ సరఫరా వ్యవస్థతో పాటు సుస్థిరమైన దీర్ఘకాల భాగస్వామ్యాన్ని కోరుకుంటోందని ఆయన అన్నారు. అలాంటి పరిస్థితుల్లో భారత్ ప్రపంచానికి ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని స్పష్టం చేశారు.
పారిస్ను అద్భుతమైన ఆలోచనలు, ఆవిష్కరణల నగరంగా అభివర్ణించిన మోదీ, ప్రవాస భారతీయులు ఈ నగరానికి కొత్త వెలుగులు తెచ్చారని ప్రశంసించారు. భారత్ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు.
తాను దేశానికి 12 ఏళ్లుగా సేవలందించడం గౌరవంగా భావిస్తున్నానని మోదీ తెలిపారు. ఈ కాలంలో దేశ జీడీపీ, విమానాశ్రయాలు, జాతీయ రహదారుల నిర్మాణం రెట్టింపు అయ్యాయని ఆయన చెప్పారు. అలాగే 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని ఆయన వెల్లడించారు.
భారత్ ప్రపంచ రూపురేఖలను మార్చే స్థాయికి ఎదుగుతోందని ప్రధాని వ్యాఖ్యానించారు. భారత్–ఫ్రాన్స్ సంబంధాలు ప్రత్యేక అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరుకున్నాయని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది ఇరుదేశాలు కలిసి నీటి, ఆహార భద్రతకు ఉపయోగపడే ‘తృష్ణ’ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు కూడా ఆయన వెల్లడించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















