వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్-యూజీ 2026 పరీక్షకు దేశవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మే 3న జరగనున్న ఈ ప్రతిష్ఠాత్మక పరీక్ష నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బీఎన్ఎస్ఎస్ చట్టంలోని సెక్షన్ 163 అమలులో ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఈ నిబంధనల ప్రకారం పరీక్షా కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడడం నిషేధం.
అదేవిధంగా, పరీక్షా కేంద్రాల సమీపంలో ఉన్న జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను కూడా 100 మీటర్ల పరిధిలో మూసివేయాలని ఆదేశించారు. పరీక్షను ఎలాంటి అంతరాయం లేకుండా నిర్వహించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు సుమారు 22.79 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగనుండగా, విద్యార్థులు కనీసం అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. మధ్యాహ్నం 1:30 గంటల తరువాత గేట్లు మూసివేయబడతాయని స్పష్టం చేశారు.
వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, వర్షం వచ్చే అవకాశముండటంతో విద్యార్థులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అడ్మిట్ కార్డు, ఫొటోలు తడవకుండా ఉండేందుకు ట్రాన్స్పరెంట్ పౌచ్లను ఉపయోగించాలన్నారు. ట్రాఫిక్ పరిస్థితులను ముందుగానే అంచనా వేసుకొని, సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. ఎలాంటి సందేహాలు ఉన్నా ఎన్టీఏ హెల్ప్లైన్ నంబర్లకు కాల్ చేయాలని లేదా ఇమెయిల్ ద్వారా సంప్రదించాలని తెలిపారు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















