ఇంటర్నెట్ డెస్క్: ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ విపుల్ షాకు చెందిన సన్షైన్ పిక్చర్స్ ఐపీఓకు మదుపర్ల నుంచి తొలిరోజే భారీ స్పందన లభించింది. మంగళవారం సబ్స్క్రిప్షన్ ప్రారంభమైన కేవలం 90 నిమిషాల్లోనే ఐపీఓ పూర్తిగా సబ్స్క్రైబ్ అయింది. ఎన్ఎస్ఈలో అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం.. 54.59 లక్షల షేర్లకు 54.86 లక్షల బిడ్లు దాఖలయ్యాయి. దీంతో ఇష్యూ ప్రారంభమైన కొద్దిసేపటికే పెట్టుబడిదారుల ఆసక్తి స్పష్టమైంది.
రిటెయిల్ ఇన్వెస్టర్ల విభాగంలో 1.49 రెట్ల సబ్స్క్రిప్షన్ నమోదైంది. నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటా 1.16 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. కంపెనీ ఐపీఓకు ముందే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.84.64 కోట్ల నిధులను సమీకరించింది. ఐపీఓకు తొలిరోజే వచ్చిన స్పందనతో మిగిలిన రోజుల్లో సబ్స్క్రిప్షన్ మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
రూ.282 కోట్ల సమీకరణ
సన్షైన్ పిక్చర్స్ మొత్తం రూ.282 కోట్ల నిధులను సమీకరించే లక్ష్యంతో పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. ఐపీఓ సబ్స్క్రిప్షన్ ఆగస్టు 20న ముగియనుంది. ఒక్కో షేరుకు రూ.342-360గా ప్రైస్ బ్యాండ్ను నిర్ణయించింది. ఈ ఇష్యూలో 48 లక్షల తాజా ఈక్విటీ షేర్లతో పాటు 30.37 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (OFS) కింద విక్రయిస్తున్నారు.
OFSలో భాగంగా ప్రమోటర్లు విపుల్ అమృతలాల్ షా, షెఫాలీ విపుల్ షా తమ వాటాలను విక్రయిస్తున్నారు. తాజా షేర్ల ద్వారా సమీకరించే నిధులను కంపెనీ తన వ్యాపార అవసరాలు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించుకోనుంది. ఐపీఓ ప్రక్రియ పూర్తయిన అనంతరం సన్షైన్ పిక్చర్స్ షేర్లు ఆగస్టు 25న స్టాక్ మార్కెట్లలో లిస్ట్ కానున్నాయి.
మిల్కీ మిస్ట్ షేర్లకు ఘనమైన లిస్టింగ్
మరోవైపు డెయిరీ ఉత్పత్తుల తయారీ సంస్థ మిల్కీ మిస్ట్ డైరీ ఫుడ్ షేర్లు మంగళవారం స్టాక్ మార్కెట్లో మంచి లాభాలతో లిస్టయ్యాయి. కంపెనీ ఐపీఓ ఇష్యూ ధర రూ.140 కాగా.. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో దాదాపు 18 శాతం ప్రీమియంతో రూ.165 వద్ద షేర్లు లిస్టయ్యాయి. దీంతో ఐపీఓలో షేర్లు పొందిన మదుపర్లకు లిస్టింగ్ రోజే మంచి లాభం లభించింది.
లిస్టింగ్ అనంతరం కూడా షేర్లలో కొనుగోళ్ల జోరు కొనసాగింది. ఒక దశలో షేరు ధర 29.60 శాతం పెరిగి రూ.181.45 వద్ద గరిష్ఠాన్ని తాకింది. ఈ స్థాయిలో కంపెనీ మార్కెట్ విలువ సుమారు రూ.13,968.81 కోట్లకు చేరింది. అయితే అనంతరం షేర్ల ధరలో కొంత ఒడుదొడుకులు కనిపించాయి.
మిల్కీ మిస్ట్ డైరీ ఫుడ్ ఐపీఓకు కూడా మదుపర్ల నుంచి విశేష స్పందన లభించింది. చివరి రోజు నాటికి ఇష్యూ 56.12 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. కంపెనీ రూ.1,553 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో ఆగస్టు 11న ఐపీఓను ప్రారంభించగా.. ఆగస్టు 13న సబ్స్క్రిప్షన్ ముగిసింది. భారీ సబ్స్క్రిప్షన్ నేపథ్యంలో లిస్టింగ్ కూడా ప్రీమియంతో జరగడంతో ఐపీఓలో పాల్గొన్న మదుపర్లలో ఉత్సాహం కనిపించింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















