ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

పశ్చిమాసియా సెగ: సామాన్యుడిపై ఇంధన భారం.. ఉక్కు ధరలకు రెక్కలు!

March 9, 2026
in Business News, News
0
పశ్చిమాసియా సెగ: సామాన్యుడిపై ఇంధన భారం.. ఉక్కు ధరలకు రెక్కలు!
Share on FacebookShare on TwitterShare on Whatsapp

పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన కొరత ఏర్పడుతుందనే ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం భారత్‌లో ముడి చమురు మరియు రిఫైన్డ్ పెట్రోలియం ఉత్పత్తుల రూపంలో దాదాపు 250 మిలియన్ బ్యారెళ్లకు సమానమైన 4,000 కోట్ల లీటర్ల ఇంధన నిల్వలు ఉన్నాయని వెల్లడించింది. ఈ నిల్వలు దేశ అవసరాలకు 7 నుంచి 8 వారాల వరకు (దాదాపు రెండు నెలలు) సరిపోతాయని ప్రభుత్వం తెలిపింది.

మంగళూరు, పడూర్‌, విశాఖపట్నం ప్రాంతాల్లోని వ్యూహాత్మక చమురు నిల్వ కేంద్రాలు, ఆయిల్ ట్యాంకులు, పైప్‌లైన్లు, సముద్ర నౌకల్లో ఈ నిల్వలు భద్రంగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. దేశంలో కేవలం 25 రోజులకు మాత్రమే ఇంధనం ఉందన్న ప్రచారం పూర్తిగా తప్పని నివేదిక స్పష్టం చేసింది.

హర్మూజ్ మార్గంపై ఆధారపడటం తగ్గింది

గతంలో భారత్‌కు చమురు దిగుమతులు ఎక్కువగా పశ్చిమాసియా దేశాలపైనే ఆధారపడి ఉండేవి. అయితే ప్రస్తుతం పరిస్థితి మారింది. దాదాపు 40 దేశాల నుంచి భారత్ చమురును దిగుమతి చేసుకుంటోంది. అందులో కేవలం 40 శాతం మాత్రమే హర్మూజ్ జలసంధి మార్గం ద్వారా వస్తుండగా, మిగతా 60 శాతం రష్యా, పశ్చిమ ఆఫ్రికా, అమెరికా, మధ్య ఆసియా దేశాల నుంచి వస్తోంది. దీంతో ఒకే మార్గంపై ఆధారపడే పరిస్థితి తగ్గిందని అధికారులు చెబుతున్నారు.

రష్యా నుంచి సరఫరా కొనసాగుతోంది

భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా ప్రస్తుతం కూడా రష్యానే కొనసాగుతోంది. అంతర్జాతీయ రాజకీయ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ రష్యా నుంచి చమురు దిగుమతులు ఆగలేదని ప్రభుత్వం వెల్లడించింది. ఇటీవల కూడా రష్యా నుంచి చమురు సరఫరా కొనసాగుతోందని తెలిపింది.

ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయ్

గత నాలుగేళ్లలో భారత్‌లో పెట్రోల్ ధరలు పెద్దగా పెరగలేదని నివేదిక పేర్కొంది. 2022 నుంచి 2026 ఫిబ్రవరి వరకు ఢిల్లీలో పెట్రోల్ ధర 0.67% తగ్గింది. అదే సమయంలో పాకిస్థాన్‌లో 55%, జర్మనీలో 22% పెరిగినట్లు వివరించింది. వినియోగదారులపై భారం పడకుండా ఉండేందుకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్‌పై రూ.24,500 కోట్లు, ఎల్‌పీజీపై రూ.40,000 కోట్ల వరకు నష్టాలను భరించాయని తెలిపింది.

ఇథనాల్ మిశ్రమంతో చమురు ఆదా

దేశంలో పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిశ్రమం ఉపయోగించడం వల్ల ఇప్పటివరకు సుమారు 44 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు వినియోగానికి ప్రత్యామ్నాయం లభించిందని ప్రభుత్వం పేర్కొంది.

సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగినా ఇంధన సరఫరాలో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు అమెరికా, రష్యా, పశ్చిమ ఆఫ్రికా దేశాల నుంచి అదనపు చమురు కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌పీసీఎల్, హెచ్‌పీసీఎల్-మిత్తల్ ఎనర్జీ వంటి సంస్థలు కూడా చమురు సరఫరాను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి.

అయితే ధరల పెరుగుదల ఆందోళన

సరఫరాలో ఇబ్బంది లేకపోయినా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. యుద్ధం ప్రారంభమైన సమయంలో బ్యారెల్ ధర 70 డాలర్లు ఉండగా ప్రస్తుతం 92 డాలర్లకు చేరింది. అలాగే ఎల్‌ఎన్‌జీ ధరలు కూడా పెరిగి మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్‌కు 24–25 డాలర్లకు చేరాయి.

ఇంధన ధరలు పెరగడం వల్ల రవాణా వ్యయాలు కూడా పెరుగుతున్నాయని, దాని ప్రభావం ఉక్కు పరిశ్రమతో పాటు ఇతర రంగాలపై పడే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ దేశంలో ఇంధన కొరత ఏర్పడే పరిస్థితి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: Crude Oil PricesEconomic ImpactEnergy CrisisEnergy Market NewsEnergy SecurityFuel InflationFuel Price ImpactGlobal Commodity PricesGlobal Economy NewsGlobal Oil MarketGlobal Trade ImpactIndustrial Costs RisingInflation ConcernsMarket VolatilityMiddle East TensionsNewsOil Price SurgeOil Supply ChainShipping Cost Increaseshivasakthi netshivasakthi newsSteel Price RiseWest Asia Crisis
ShareTweetSend
Previous Post

రఘురామ కస్టోడియల్‌ టార్చర్‌ కేసు.. ఐదో రోజు సునీల్‌ నాయక్‌ విచారణ

Next Post

లేఆఫ్ రూమర్స్‌పై టెక్ మహీంద్రా అధికారిక ప్రకటన

Related Posts

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ శాంసంగ్‌ భారత మార్కెట్‌లో మరో కొత్త 5జీ ఫోన్‌ను విడుదల చేసింది
Technology News

6 ఏళ్ల అప్‌డేట్స్‌తో శాంసంగ్‌ కొత్త ఫోన్‌.. ధర రూ.23,999 నుంచి

August 3, 2026
బీజేపీ అభ్యర్థిపై భారీ మెజార్టీతో పీకే గెలుపు
India News

బీజేపీ అభ్యర్థిపై భారీ మెజార్టీతో పీకే గెలుపు

August 3, 2026
కావేరీ జలాల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన తమిళనాడు
India News

కావేరీ జలాల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన తమిళనాడు

August 3, 2026
గాజులరామారంలో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల కొరడా
Telangana News

గాజులరామారంలో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల కొరడా

August 3, 2026
PKOC-2 డిప్‌సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కడం సంతోషకరం: కిషన్‌రెడ్డి
News

PKOC-2 డిప్‌సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కడం సంతోషకరం: కిషన్‌రెడ్డి

August 3, 2026
విజయవాడ దుర్గమ్మకు రూ.17 లక్షల విలువైన స్వర్ణలక్ష్మి కాసుల హారం కానుక
Andhra Pradesh News

విజయవాడ దుర్గమ్మకు రూ.17 లక్షల విలువైన స్వర్ణలక్ష్మి కాసుల హారం కానుక

August 3, 2026
Next Post
లేఆఫ్ రూమర్స్‌పై టెక్ మహీంద్రా అధికారిక ప్రకటన

లేఆఫ్ రూమర్స్‌పై టెక్ మహీంద్రా అధికారిక ప్రకటన

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 3, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 3, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
బీజేపీ అభ్యర్థిపై భారీ మెజార్టీతో పీకే గెలుపు

బీజేపీ అభ్యర్థిపై భారీ మెజార్టీతో పీకే గెలుపు

August 3, 2026
కావేరీ జలాల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన తమిళనాడు

కావేరీ జలాల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన తమిళనాడు

August 3, 2026
గాజులరామారంలో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల కొరడా

గాజులరామారంలో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల కొరడా

August 3, 2026
PKOC-2 డిప్‌సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కడం సంతోషకరం: కిషన్‌రెడ్డి

PKOC-2 డిప్‌సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కడం సంతోషకరం: కిషన్‌రెడ్డి

August 3, 2026

Recent News

బీజేపీ అభ్యర్థిపై భారీ మెజార్టీతో పీకే గెలుపు

బీజేపీ అభ్యర్థిపై భారీ మెజార్టీతో పీకే గెలుపు

August 3, 2026
కావేరీ జలాల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన తమిళనాడు

కావేరీ జలాల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన తమిళనాడు

August 3, 2026
గాజులరామారంలో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల కొరడా

గాజులరామారంలో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల కొరడా

August 3, 2026
PKOC-2 డిప్‌సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కడం సంతోషకరం: కిషన్‌రెడ్డి

PKOC-2 డిప్‌సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కడం సంతోషకరం: కిషన్‌రెడ్డి

August 3, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

బీజేపీ అభ్యర్థిపై భారీ మెజార్టీతో పీకే గెలుపు

బీజేపీ అభ్యర్థిపై భారీ మెజార్టీతో పీకే గెలుపు

August 3, 2026
కావేరీ జలాల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన తమిళనాడు

కావేరీ జలాల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన తమిళనాడు

August 3, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.