ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు గణనీయంగా తగ్గడం మార్కెట్లకు ప్రధాన ప్రోత్సాహకంగా మారింది.
సెన్సెక్స్ ఏకంగా 2,946 పాయింట్లు ఎగబాకి 77,562 వద్ద ముగియగా, నిఫ్టీ 873 పాయింట్ల లాభంతో 23,995 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ సమయంలో నిఫ్టీ 24,000 మార్క్ను తాకడం విశేషం.
ఈ ర్యాలీతో బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.15 లక్షల కోట్లు పెరిగి రూ.445 లక్షల కోట్లకు చేరింది. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అదానీ పోర్ట్స్, మారుతీ, టైటాన్ వంటి ప్రధాన స్టాక్స్ 5% నుంచి 8% వరకు లాభపడ్డాయి.
చమురు ధరలు ఒక్కరోజులోనే భారీగా పడిపోవడం, రూపాయి విలువ కొంత మెరుగుపడడం, అలాగే ఆర్బీఐ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడం వంటి అంశాలు మార్కెట్ సెంటిమెంట్ను బలపరిచాయి. అంతర్జాతీయ మార్కెట్లు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్ మార్కెట్లు గణనీయంగా పెరిగాయి. దీంతో గ్లోబల్ పాజిటివ్ ట్రెండ్ దేశీయ మార్కెట్లకు మద్దతు ఇచ్చింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















