రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగాల సృష్టే లక్ష్యంగా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. కిరాణా కొట్టు స్థాయి వ్యాపారాల నుంచి భారీ డేటా సెంటర్ల వరకు అన్ని రంగాలకు సంబంధించిన అనుమతులను ఒకే సింగిల్ పోర్టల్ ద్వారా మంజూరు చేసే విధానాన్ని రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. దీనివల్ల వ్యాపార ప్రారంభం సులభతరం అవుతుందని, సమయం మరియు ప్రక్రియలు గణనీయంగా తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు.
Nara Lokesh నేతృత్వంలో ఏర్పాటు చేసిన మంత్రుల బృందం సమావేశం ఉండవల్లి నివాసంలో జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, కందుల దుర్గేశ్, టీజీ భరత్ పాల్గొన్నారు. రాష్ట్రంలో సుమారు 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా చేపట్టాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు.
లోకేశ్ మాట్లాడుతూ, రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన సుమారు 750 భారీ పరిశ్రమలు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. ఇవి వేగంగా గ్రౌండింగ్ అయితే పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ఆయన అన్నారు. పరిశ్రమల శాఖ, ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు అధికారులు ప్రాజెక్టుల పురోగతిని నిరంతరం ట్రాక్ చేస్తూ వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రతి నెలా భూమిపూజలు, ప్రారంభోత్సవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
నవంబర్లో జరగనున్న భాగస్వామ్య సదస్సు నాటికి సాధ్యమైనంత ఎక్కువ పరిశ్రమలు ప్రారంభ దశకు చేరేలా చర్యలు తీసుకోవాలని లోకేశ్ చెప్పారు. అంతర్జాతీయంగా, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రోడ్ షోలు నిర్వహించి రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించాలని సూచించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు.
అదేవిధంగా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు వేగంగా పూర్తయ్యేలా చూడాలని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా వస్తున్న ఎంఎస్ఎంఈలను కూడా ఆన్బోర్డ్ చేయాలని సూచించారు. భోగాపురం విమానాశ్రయం త్వరలో అందుబాటులోకి రానున్న నేపథ్యంలో విశాఖపట్నంలో హోటల్ గదుల సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
స్లరీ పైప్లైన్ వంటి కీలక మౌలిక సదుపాయాలపై అధ్యయనం చేయాలని అధికారులు ఆదేశించారు. ఉక్కు హబ్ అభివృద్ధి నేపథ్యంలో ముడిసరకు సరఫరా సులభతరం చేసే మార్గాలను పరిశీలించాలని కూడా చెప్పారు. టెక్స్టైల్ పరిశ్రమలకు క్వాప్టివ్ పవర్ బ్యాంకింగ్ సదుపాయం వంటి ప్రోత్సాహకాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
వేగం, స్థిరత్వం, సులభతర సేవలే ప్రభుత్వ ప్రత్యేకతలని పేర్కొన్న లోకేశ్, ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్పై కూడా అధ్యయనం చేయాలని సూచించారు. గార్మెంట్ పరిశ్రమలను ఆకర్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















