మేడ్చల్ జిల్లాలోని ఉప్పల్–నారపల్లి ఎలివేటెడ్ కారిడార్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మౌలాలి నుంచి పోచారం వైపు వెళ్తున్న కారు అతివేగంతో వెళ్లి వంతెన పిల్లర్ నంబర్ 97ను ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో కారులో మొత్తం ఎనిమిది మంది విద్యార్థులు ఉన్నారు.
ఈ ప్రమాదంలో సాయివరుణ్ (23), నిఖిల్ (22) అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన వెంకట్, రాకేశ్లను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన యశ్వంత్, సాత్విక్, హర్షవర్ధన్, అభినవ్ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమికంగా భావిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Accident Alert Amaravathi Andhra pradesh Andhrapradesh Breaking news BreakingNews BreakingNewsTelugu Chandrababu naidu Climate Cricket Crime News Development Devotion Devotional Farmers Flood Government Heavy rains High court Hyderabad India Investment Karthika masam Mantha Toofan Movie Nara Lokesh Naralokesh News PM Modi Police Politics Review Road accident Sports Srikakulam Tdp Telangana Toofan USA Vijayawada Warning Weather YCP YSRCP


















