తెలంగాణలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్స్ వర్సిటీలో విలీనం చేయడంపై భారాస శాసనసభాపక్ష ఉప నేత, మాజీ మంత్రి హరీశ్రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ల విలీనంతో ముఖ్యంగా పేద, మధ్యతరగతి విద్యార్థులపై ఆర్థిక భారం పెరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
వరంగల్లో పాలిటెక్నిక్ విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన హరీశ్రావును పోలీసులు అరెస్టు చేసి సుబేదారి పోలీస్స్టేషన్కు తరలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం వారి గొంతు నొక్కేలా వ్యవహరిస్తోందని విమర్శించారు.
పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్స్ వర్సిటీలో విలీనం చేస్తే భవిష్యత్తులో ప్రైవేటీకరణకు దారితీసే ప్రమాదం ఉందని హరీశ్రావు పేర్కొన్నారు. ఫీజులు భారీగా పెరిగితే పేద విద్యార్థులు సాంకేతిక విద్యకు దూరమయ్యే పరిస్థితి వస్తుందని అన్నారు. ఇదే తరహా విధానాన్ని ఏపీ, దిల్లీలో అమలు చేసి అనంతరం వెనక్కి తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. అక్కడ విఫలమైన విధానాన్ని తెలంగాణలో ఎందుకు అమలు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ప్రశ్నించారు.
విద్యార్థులను కళాశాలలోనే నిర్బంధించడం, వారికి భోజనం కూడా అందించకపోవడం దారుణమని హరీశ్రావు అన్నారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే వినాలని కోరారు. దిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో సమస్యలపై పోరాడిన కాంగ్రెస్ నాయకత్వం తెలంగాణలోని పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను కూడా పట్టించుకోవాలని సూచించారు.
జీవో 97ను తక్షణమే రద్దు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హరీశ్రావు హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశంలో ప్రభుత్వం మొండివైఖరి వీడాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై కూడా హరీశ్రావు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. హనుమకొండ కలెక్టరేట్ వద్ద ఉద్యోగ సంఘాల ఐకాస ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాకు ఆయన సంఘీభావం తెలిపారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పెట్టుకున్న రేవంత్రెడ్డి ప్రభుత్వానికి ప్రజలే తగిన సమాధానం చెబుతారని హరీశ్రావు వ్యాఖ్యానించారు. సీపీఎస్ ఉద్యోగులను ఓపీఎస్లోకి మారుస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి మూడేళ్లు గడిచినా అమలు చేయలేదని ఆరోపించారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం 1 శాతం కాంట్రిబ్యూషన్తో ఈహెచ్ఎస్ పథకాన్ని తీసుకొచ్చామని, ప్రస్తుత ప్రభుత్వం దాన్ని 1.5 శాతానికి పెంచిందని హరీశ్రావు పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఆరు డీఏలు పెండింగ్లో ఉన్నాయని ఆరోపించారు.
పదవీ విరమణ ప్రయోజనాలు పొందేందుకు కమీషన్ అడుగుతున్నారంటూ ఓ బాధితురాలు కన్నీళ్లు పెట్టుకున్న విషయాన్ని కూడా హరీశ్రావు ప్రస్తావించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల న్యాయమైన పోరాటానికి భారాస అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, మాలోత్ కవిత, దాస్యం వినయ్భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
అంతకుముందు గురువారం ఉదయం హైదరాబాద్లోని హరీశ్రావు నివాసం వద్ద పోలీసులు మోహరించారు. ఉదయం 8 గంటల నుంచి సుమారు 9.30 గంటల వరకు పోలీసులు అక్కడే ఉన్నారు. అనంతరం పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో హరీశ్రావు వరంగల్కు బయలుదేరారు. అక్కడ పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపిన అనంతరం పోలీసులు ఆయనను అరెస్టు చేసి సుబేదారి పోలీస్స్టేషన్కు తరలించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















