రాష్ట్రంలో ఈ ఏడాది పంటల బీమా పరిధి గణనీయంగా పెరిగింది. గతేడాది ఖరీఫ్లో 19 లక్షల ఎకరాలకు పంటల బీమా చేయగా.. ఈ ఏడాది అది 40.63 లక్షల ఎకరాలకు చేరింది. రైతులు తమ వాటాగా రూ.265.50 కోట్ల ప్రీమియం చెల్లించారు. అయితే బీమా ప్రీమియం చెల్లించినంత మాత్రాన పంటల బీమా ప్రయోజనం ఆటోమేటిక్గా వర్తించదు. ఈ-పంటలో రైతు పేరు, సాగు వివరాలు నమోదు కావడం తప్పనిసరి.
ఈ-పంటలో నమోదైన పంట, బీమా కోసం నమోదు చేసిన పంట వివరాలు ఒకే విధంగా ఉండాలి. సర్వే నంబరు, సాగు విస్తీర్ణం, పంట రకం తదితర వివరాల్లో తేడాలు ఉంటే బీమా క్లెయిమ్ సమయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందువల్ల ఈ-పంట నమోదు సమయంలోనే రైతులు తమ వివరాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. దీనితోపాటు ఈ-కేవైసీ పూర్తి చేయడం కూడా కీలకం.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 38 లక్షల మంది రైతుల వివరాలు ఈ-పంటలో నమోదయ్యాయి. అయితే వారిలో కేవలం 1,10,550 మంది మాత్రమే ఈ-కేవైసీ పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన రైతులు కూడా తమ వివరాలను నమోదు చేయించుకోవడంతోపాటు ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని వ్యవసాయశాఖ సూచిస్తోంది.
ఈ-పంటలో నమోదు కేవలం పంటల బీమాకే పరిమితం కాదు. ప్రభుత్వం అందించే పలు వ్యవసాయ ప్రయోజనాలకు కూడా ఇది కీలక ఆధారంగా మారుతోంది. పంట ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నా.. కరవు, అధిక వర్షాలు, వరదల కారణంగా పంటలు దెబ్బతిన్నప్పుడు పెట్టుబడి సాయం అందించాలన్నా.. ఈ-పంటలో రైతు వివరాలు నమోదై ఉండాలి.
అదేవిధంగా వ్యవసాయ రుణాలు, వివిధ రాయితీ పథకాలు, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలను పొందేందుకు కూడా పంట సాగు వివరాలు ఈ-పంటలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లకు రైతు విశిష్ఠ గుర్తింపు సంఖ్యను తప్పనిసరి చేసిన నేపథ్యంలో.. రైతులు తమ అన్ని కమతాలను ఫార్మర్ ఐడీతో అనుసంధానించుకోవడం అవసరం.
ఈ-పంటలో నమోదు చేసుకునేందుకు రైతులకు మూడు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఏపీఏఐఎంఎస్ (ఫార్మర్ యాప్) ద్వారా రైతులే స్వయంగా మొబైల్, ఆధార్ వివరాలతో లాగిన్ అయి తమ భూమి, సర్వే నంబరు, సాగు చేసిన పంట వివరాలను నమోదు చేసుకోవచ్చు. అదే సమయంలో ఈ-కేవైసీని కూడా పూర్తి చేసుకునే అవకాశం ఉంది.
ఇప్పటివరకు 5,744 మంది రైతులు 10,226 కమతాల్లో స్వయంగా ఈ విధానంలో వివరాలను నమోదు చేసుకున్నారు. స్వయంగా నమోదు చేసుకోలేని రైతులు సమీపంలోని రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయ, ఉద్యానశాఖ సిబ్బంది సహాయం తీసుకోవచ్చు. వ్యవసాయశాఖ ఏర్పాటు చేసిన ప్రైవేటు సర్వేయర్ల సేవలను కూడా వినియోగించుకోవచ్చు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















