నోట్ల కట్టల వ్యవహారంలో చిక్కుకున్న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపించారు. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
దిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో ఆయన అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం సంభవించగా, అగ్నిమాపక సిబ్బంది కాలిపోయిన నోట్ల కట్టలను గుర్తించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులతో కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. విచారణలో నోట్ల కట్టలు ఉన్న విషయం నిజమని తేలింది.
ఈ నేపథ్యంలో జస్టిస్ వర్మను రాజీనామా చేయాలని సూచించినప్పటికీ, ఆయన తొలుత నిరాకరించారు. తనపై వచ్చిన ఆరోపణలను పూర్తిగా ఖండిస్తూ, తమ కుటుంబానికి ఈ నగదుతో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. అంతేకాకుండా విచారణ నివేదికను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడ కూడా ఆయనకు ఉపశమనం లభించలేదు.
ఇదిలా ఉండగా, ఆయనను పదవి నుంచి తొలగించేందుకు అభిశంసన ప్రక్రియను ప్రారంభించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతి, ప్రధానమంత్రికి లేఖలు రాయగా, పార్లమెంటులో కూడా ఈ విషయంపై తీర్మానం వచ్చింది. తాజాగా ఆయన రాజీనామా చేయడంతో అభిశంసన ప్రక్రియ ముగిసే అవకాశముందని లోక్సభ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటన న్యాయవ్యవస్థలో పారదర్శకత, నైతిక విలువలపై మరోసారి చర్చకు దారితీసింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















