కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జల్ జీవన్ మిషన్ రెండో దశకు శ్రీకారం చుట్టింది. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంలో భాగంగా, ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీరు అందించడమే ఈ మిషన్ ప్రధాన ఉద్దేశ్యం.దేశంలోని ప్రతి మారుమూల గ్రామానికి, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘జల్ జీవన్ మిషన్ 2.0 (Jal Jeevan Mission 2.0)’ను అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న చారిత్రాత్మక ఒప్పందం (MoU) అనంతరం ఆయన ఢిల్లీ నుంచి వర్చువల్ వేదికగా మీడియాతో మాట్లాడారు.
వాస్తవానికి జల్ జీవన్ మిషన్ గడువు ముగిసినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu ప్రధాని నరేంద్ర మోదీతో జరిపిన చర్చలు ఈ ప్రాజెక్ట్ పొడిగింపులో కీలక పాత్ర పోషించాయి. ఏపీలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు, కొత్తగా వస్తున్న ఆవాసాలకు నీటిని అందించేందుకు ఈ పొడిగింపు ఒక వరమని మంత్రి పేర్కొన్నారు.
గణాంకాల్లో జల్ జీవన్ మిషన్ (Phase 1 vs Phase 2)
మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ మిషన్ ప్రయాణం గణాంకాల్లో ఇలా ఉంది:
- మొదటి దశ విజయం: దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 16 కోట్ల గృహాలకు పైపుల ద్వారా సురక్షిత నీటి కనెక్షన్లు ఇచ్చారు.
- రెండో దశ లక్ష్యం: ఇంకా మిగిలి ఉన్న 3 కోట్ల ఇళ్లకు యుద్ధ ప్రాతిపదికన కనెక్షన్లు ఇవ్వడం.
- ఏపీ లక్ష్యం: ఆంధ్రప్రదేశ్లో వంద శాతం సంతృప్తత (100% Saturation) సాధించడం
మహిళల పాత్ర: డ్వాక్రా సంఘాలకు బాధ్యత
కేవలం నీటిని అందించడమే కాకుండా, ఆ నీటి నాణ్యతను పరీక్షించే బాధ్యతను ఏపీలోని డ్వాక్రా (SHG) మహిళలకు అప్పగించాలని మంత్రి సూచించారు.
- దీనివల్ల మహిళా సాధికారతతో పాటు, గ్రామస్థులకు నాణ్యమైన నీరు అందుతుందనే భరోసా లభిస్తుంది.
- ప్రతి గ్రామంలో ఐదుగురు మహిళలకు ఫీల్డ్ టెస్టింగ్ కిట్స్ (FTK) పై శిక్షణ ఇస్తారు.
- ఫ్లోరైడ్, లవణాల శాతం వంటి 12 రకాల పరీక్షలను వీరు నిర్వహిస్తారు.
వికసిత్ భారత్ – 2047 లక్ష్యం
“2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే, పౌరుల ఆరోగ్యం ముఖ్యం. కలుషిత నీరు తాగడం వల్ల వచ్చే రోగాలను అరికట్టగలిగితేనే మనం ఆర్థికంగా బలోపేతం అవుతాం” అని మంత్రి స్పష్టం చేశారు. కేవలం తాగునీరే కాకుండా, అగ్రికల్చర్ సెక్టార్లో సాగునీటి సరఫరాను కూడా సమర్థవంతంగా నిర్వహించేలా టెక్నాలజీని వాడుతామని ఆయన తెలిపారు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews



















