ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ప్లాస్టిక్‌పై రాజమహేంద్రవరం యుద్ధం

August 19, 2026
in Andhra Pradesh News, News
0
ప్లాస్టిక్‌పై రాజమహేంద్రవరం యుద్ధం

ప్లాస్టిక్‌పై రాజమహేంద్రవరం యుద్ధం

Share on FacebookShare on TwitterShare on Whatsapp

గోదావరి పుష్కరాలను ప్లాస్టిక్‌ రహితంగా నిర్వహించి దేశానికి ఆదర్శంగా నిలవాలన్న లక్ష్యంతో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ చర్యలు ముమ్మరం చేసింది. ఆగస్టు 15 నుంచి నగరంలో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగంపై పూర్తి నిషేధం అమల్లోకి రావడంతో అధికారులు తనిఖీలను కఠినతరం చేస్తున్నారు. ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా తగ్గించడంతోపాటు ప్రజలకు ప్రత్యామ్నాయ వస్తువులపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.

సుమారు 4.5 లక్షల జనాభా ఉన్న రాజమహేంద్రవరంలో రోజుకు దాదాపు ఐదు మెట్రిక్‌ టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు వెలువడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో సుమారు రెండు టన్నుల వ్యర్థాలే రీసైక్లింగ్‌కు ఉపయోగపడుతున్నాయి. మిగిలిన వ్యర్థాల్లో అధిక భాగం సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ కావడంతో పారిశుద్ధ్య నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

నగరంలోని కాలువల్లో పూడిక తొలగించే సమయంలో భారీగా ప్లాస్టిక్‌ వ్యర్థాలు బయటపడుతున్నాయి. ఆవ, నల్లాచానళ్ల పరిసరాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ప్లాస్టిక్‌ వ్యర్థాలు కాలువల్లో పేరుకుపోవడంతో వర్షాకాలంలో నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు.

నగర పరిధిలో రోజూ సుమారు 45 ఎంఎల్‌డీ వ్యర్థజలాలు గోదావరిలో కలుస్తున్న నేపథ్యంలో నదీ కాలుష్య నియంత్రణపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అధికారులు భావిస్తున్నారు. గతంలో నిర్వహించిన అధ్యయనాల్లో గోదావరి జలాల్లో సాధారణ స్థాయికంటే అధికంగా ఈకోలీ, ఇతర బ్యాక్టీరియాలు ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని అరికట్టడం మరింత కీలకంగా మారింది.

ప్లాస్టిక్‌ నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు నగర పరిధిలో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఎంహెచ్‌వో పర్యవేక్షణలో పనిచేసే ఒక్కో బృందంలో ఇద్దరు శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, ఒక మహిళా పోలీసు ఉంటారు. దుకాణాలు, వ్యాపార సంస్థలను తనిఖీ చేసి నిషేధిత ప్లాస్టిక్‌ విక్రయాలు, వినియోగాన్ని గుర్తిస్తారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించనున్నారు. చర్యల పురోగతిని ప్రతి బుధవారం సమీక్షించనున్నారు.

ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా ఉపయోగించగల వస్తువులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రైతు బజార్లు, ప్రధాన కూడళ్లు, ఇతర ముఖ్య ప్రాంతాల్లో ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. మెప్మా సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ ఉత్పత్తులు, వాటిని ఎక్కడ కొనుగోలు చేయవచ్చనే వివరాలను తెలియజేస్తారు. వివిధ ప్రత్యామ్నాయ వస్తువులతో ప్రత్యేక ప్రదర్శన కూడా ఏర్పాటు చేయనున్నారు.

ప్లాస్టిక్‌ బాటిళ్లను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా దాతల సహకారంతో నగరంలోని 22 ప్రాంతాల్లో బాటిల్‌ సేకరణ పాయింట్లను ఏర్పాటు చేశారు. వీటి సంఖ్యను మరో 15 వరకు పెంచేందుకు అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. సేకరించిన బాటిళ్లను క్రమబద్ధంగా తరలించి రీసైక్లింగ్‌కు పంపేలా చర్యలు తీసుకోనున్నారు.

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ విక్రయం, వినియోగాన్ని నిరోధించేందుకు జరిమానాలను కూడా క్రమబద్ధీకరించారు. సాధారణ దుకాణాలకు తొలిసారి రూ.500, మధ్యస్థాయి దుకాణాలకు రూ.1,000, పెద్ద దుకాణాలకు రూ.3,000 వరకు జరిమానా విధించనున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ మళ్లీ పట్టుబడితే జరిమానాను రెట్టింపు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు.

ప్రజల్లో అవగాహన పెంచడంతోపాటు వ్యాపారులకు ప్రత్యామ్నాయ వస్తువుల వినియోగంపై వివరాలు అందిస్తామని అధికారులు చెబుతున్నారు. గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు, వ్యాపారులు సహకరించాలని నగరపాలక సంస్థ కోరుతోంది.

‘‘ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు ప్రత్యామ్నాయ వస్తువుల వినియోగాన్ని వివరిస్తాం. వాటిని అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటాం. స్వచ్ఛ రాజమహేంద్రవరం సాధనకు వ్యాపారులు, ప్రజలు సహకరించాలి’’ అని కమిషనర్‌ రాహుల్‌ మీనా తెలిపారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: Andhra pradeshClean RajahmundryGodavari PushkaraluGodavari riverPlastic BanPlastic PollutionPlastic RecyclingPlastic WasteRajahmundryRajamahendravaram Municipal CorporationSanitationshivasakthimediashivasakthinewsSingle Use PlasticWaste Management
ShareTweetSend
Previous Post

గచ్చిబౌలిలో భారీ డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టురట్టు.. 19 మంది అరెస్ట్‌

Next Post

డాలర్‌ కంటే 3 రెట్లు.. యూరో కంటే 6 రెట్లు! భారత్‌లో నోట్ల చెలామణి

Related Posts

బీటెక్‌ పూర్తి కాలేదని ఆందోళన వద్దు.. ఉపాధికి ఉపయోగపడే కోర్సులివే/``
Education

బీటెక్‌ పూర్తి కాలేదని ఆందోళన వద్దు.. ఉపాధికి ఉపయోగపడే కోర్సులివే

August 25, 2026
ఛాతిలో నొప్పి వస్తే నిర్లక్ష్యం వద్దు.. గ్యాస్‌ అనుకుని పొరబడొద్దు
Health

ఛాతిలో నొప్పి వస్తే నిర్లక్ష్యం వద్దు.. గ్యాస్‌ అనుకుని పొరబడొద్దు

August 25, 2026
మనిషిని మించిన మరమనిషి వేగం.. 100 మీటర్ల పరుగులో సరికొత్త రికార్డు
Technology News

మనిషిని మించిన మరమనిషి వేగం.. 100 మీటర్ల పరుగులో సరికొత్త రికార్డు

August 25, 2026
ఏడేళ్ల తర్వాత భారత్‌కు షీ జిన్‌పింగ్‌.. బ్రిక్స్‌ సదస్సే వేదిక!
World News

ఏడేళ్ల తర్వాత భారత్‌కు షీ జిన్‌పింగ్‌.. బ్రిక్స్‌ సదస్సే వేదిక!

August 25, 2026
రక్షాబంధన్‌ వేళ కల్తీ దందా.. 1,000 కిలోల రసగుల్లాలు సీజ్‌
India News

రక్షాబంధన్‌ వేళ కల్తీ దందా.. 1,000 కిలోల రసగుల్లాలు సీజ్‌

August 25, 2026
పంచాంగం: 25 ఆగస్టు 2026 (మంగళవారం)
Rasi Phalalu

పంచాంగం: 25 ఆగస్టు 2026 (మంగళవారం)

August 25, 2026
Next Post
డాలర్‌ కంటే 3 రెట్లు.. యూరో కంటే 6 రెట్లు! భారత్‌లో నోట్ల చెలామణి

డాలర్‌ కంటే 3 రెట్లు.. యూరో కంటే 6 రెట్లు! భారత్‌లో నోట్ల చెలామణి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 25, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 25, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 25 ఆగస్టు 2026 (మంగళవారం)

పంచాంగం: 25 ఆగస్టు 2026 (మంగళవారం)

August 25, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
ఛాతిలో నొప్పి వస్తే నిర్లక్ష్యం వద్దు.. గ్యాస్‌ అనుకుని పొరబడొద్దు

ఛాతిలో నొప్పి వస్తే నిర్లక్ష్యం వద్దు.. గ్యాస్‌ అనుకుని పొరబడొద్దు

August 25, 2026
మనిషిని మించిన మరమనిషి వేగం.. 100 మీటర్ల పరుగులో సరికొత్త రికార్డు

మనిషిని మించిన మరమనిషి వేగం.. 100 మీటర్ల పరుగులో సరికొత్త రికార్డు

August 25, 2026
ఏడేళ్ల తర్వాత భారత్‌కు షీ జిన్‌పింగ్‌.. బ్రిక్స్‌ సదస్సే వేదిక!

ఏడేళ్ల తర్వాత భారత్‌కు షీ జిన్‌పింగ్‌.. బ్రిక్స్‌ సదస్సే వేదిక!

August 25, 2026
రక్షాబంధన్‌ వేళ కల్తీ దందా.. 1,000 కిలోల రసగుల్లాలు సీజ్‌

రక్షాబంధన్‌ వేళ కల్తీ దందా.. 1,000 కిలోల రసగుల్లాలు సీజ్‌

August 25, 2026

Recent News

ఛాతిలో నొప్పి వస్తే నిర్లక్ష్యం వద్దు.. గ్యాస్‌ అనుకుని పొరబడొద్దు

ఛాతిలో నొప్పి వస్తే నిర్లక్ష్యం వద్దు.. గ్యాస్‌ అనుకుని పొరబడొద్దు

August 25, 2026
మనిషిని మించిన మరమనిషి వేగం.. 100 మీటర్ల పరుగులో సరికొత్త రికార్డు

మనిషిని మించిన మరమనిషి వేగం.. 100 మీటర్ల పరుగులో సరికొత్త రికార్డు

August 25, 2026
ఏడేళ్ల తర్వాత భారత్‌కు షీ జిన్‌పింగ్‌.. బ్రిక్స్‌ సదస్సే వేదిక!

ఏడేళ్ల తర్వాత భారత్‌కు షీ జిన్‌పింగ్‌.. బ్రిక్స్‌ సదస్సే వేదిక!

August 25, 2026
రక్షాబంధన్‌ వేళ కల్తీ దందా.. 1,000 కిలోల రసగుల్లాలు సీజ్‌

రక్షాబంధన్‌ వేళ కల్తీ దందా.. 1,000 కిలోల రసగుల్లాలు సీజ్‌

August 25, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఛాతిలో నొప్పి వస్తే నిర్లక్ష్యం వద్దు.. గ్యాస్‌ అనుకుని పొరబడొద్దు

ఛాతిలో నొప్పి వస్తే నిర్లక్ష్యం వద్దు.. గ్యాస్‌ అనుకుని పొరబడొద్దు

August 25, 2026
మనిషిని మించిన మరమనిషి వేగం.. 100 మీటర్ల పరుగులో సరికొత్త రికార్డు

మనిషిని మించిన మరమనిషి వేగం.. 100 మీటర్ల పరుగులో సరికొత్త రికార్డు

August 25, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.