స్మార్ట్ఫోన్ కొనుగోలుదారులకు మరోసారి ధరల షాక్ తగిలింది. రియల్మీ తన P4 సిరీస్లోని పలు స్మార్ట్ఫోన్ మోడళ్ల ధరలను పెంచింది. మోడల్, వేరియంట్ను బట్టి గరిష్ఠంగా రూ.3 వేల వరకు ధర పెరిగింది. సవరించిన ధరలు ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానున్నాయి.
ఇప్పటికే పలు స్మార్ట్ఫోన్ సిరీస్ల ధరలను రియల్మీ సవరించింది. తాజాగా P4 సిరీస్పైనా ధరల పెంపు నిర్ణయం తీసుకుంది. రియల్మీ P4s విడుదలైన మరుసటి రోజే ఈ ధరల సవరణ జరగడం గమనార్హం. పెరిగిన ధరలు P4 Power 5G, P4x 5G, P4R 5G, P4 Lite 5G, P4 Lite 4G మోడళ్లకు వర్తించనున్నాయి.
రియల్మీ P4x 5G స్మార్ట్ఫోన్ వేరియంట్లపై గరిష్ఠంగా రూ.3 వేల వరకు ధర పెరిగింది. తాజా పెంపుతో 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999 నుంచి రూ.27,999కు చేరింది.
P4 Power 5Gపై కూడా రియల్మీ రూ.3 వేల మేర ధర పెంచింది. ఈ ఫోన్ బేస్ వేరియంట్ 8GB + 128GB ధర గతంలో రూ.29,999గా ఉండగా.. తాజా పెంపుతో రూ.32,999కు చేరింది.
P4 Lite 4G, P4 Lite 5G స్మార్ట్ఫోన్ల ధరలను రూ.2 వేల వరకు పెంచింది. దీంతో 6GB + 128GB టాప్ వేరియంట్ ధర రూ.20,999 నుంచి రూ.22,999కు పెరిగింది.
రియల్మీ P4R స్మార్ట్ఫోన్ ధరను కూడా రూ.2 వేల మేర పెంచింది. తాజా సవరణతో 4GB + 64GB బేస్ వేరియంట్ ధర రూ.19,999కు చేరింది.
మెమొరీ, చిప్సెట్ల ధరలు పెరగడంతో పాటు స్మార్ట్ఫోన్ తయారీ వ్యయాలు అధికమవుతున్న నేపథ్యంలో రియల్మీ ఈ ధరల సవరణ చేపట్టినట్లు తెలుస్తోంది. ముడి పదార్థాల ధరలు, తయారీ వ్యయాల పెరుగుదల ప్రభావం స్మార్ట్ఫోన్ ధరలపై పడుతోంది. దీంతో రాబోయే రోజుల్లో ఇతర బ్రాండ్లు కూడా తమ ధరలను సవరించే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















