గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలోని వింజనంపాడులో ఉన్న కిట్స్ (KITS) ఇంజినీరింగ్ కళాశాల వేడుకలు ‘యువ 2కె26’ మాస్ గర్జనతో మారుమోగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను అమరావతి రాజధానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
కీలక వ్యాఖ్యలు:
యువతకు సందేశం: రాజధాని అమరావతికి శాశ్వత గుర్తింపు రావడం మనందరికీ ఒక ధన్యమైన వార్త అని, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు శుభసూచకమని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
అమరావతి అంటే మన అడ్రస్: “రాజధాని లేని రాష్ట్రం అనే అపవాదు నుంచి మనల్ని అమరావతి కాపాడింది. లోక్సభలో అమరావతికి చట్టబద్ధమైన గుర్తింపు రావడం ప్రతి ఆంధ్రుడికి గర్వకారణం. ఇప్పుడు మనకు ఒక శాశ్వతమైన, స్పష్టమైన అడ్రస్ దొరికింది” అని ఆయన పేర్కొన్నారు.
చంద్రబాబు విజన్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిపై బోయపాటి ప్రశంసల జల్లు కురిపించారు. “ప్రజలను కేవలం ఓటర్లుగా కాకుండా, తన బిడ్డలుగా భావించే గొప్ప మనసున్న నాయకుడు చంద్రబాబు. ఆయన ఆలోచనలు, విజన్ వల్లే అమరావతి నేడు ప్రపంచస్థాయి గుర్తింపు దిశగా అడుగులు వేస్తోంది” అని కొనియాడారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















