విశాఖపట్నంలోని కంచరపాలెం ఐటీఐ కూడలి వద్ద ఆన్లైన్ బెట్టింగ్ అప్పుల కారణంగా ఓ బ్యాంక్ ఉద్యోగి చోరీకి యత్నించిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
పోలీసుల వివరాల ప్రకారం, అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచిలో ఆపరేషన్స్ విభాగంలో పనిచేస్తున్న ఎల్లా రవికుమార్ ఆన్లైన్ బెట్టింగ్ ఆడుతూ సుమారు రూ.65 లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. ఆ అప్పులను తీర్చేందుకు అతను బ్యాంకులోనే చోరీ చేయాలని పన్నాగం పన్ని ముందుగా రెక్కీ కూడా నిర్వహించాడు.
బ్యాంక్కు ఎక్కువగా తాకట్టు బంగారు ఆభరణాలు వస్తున్నట్లు తెలుసుకున్న అతను, ఐటీఐ కూడలి బ్రాంచిని లక్ష్యంగా ఎంచుకున్నాడు. బుధవారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో అక్కడ ఆగి పరిస్థితిని గమనించాడు. అదే సమయంలో మేనేజర్ శివరామరాజు, క్యాషియర్ రమేష్ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. సహచర ఉద్యోగి కావడంతో రవికుమార్ను వారు లోపలికి అనుమతించారు.
అవకాశం చూసి రవికుమార్ బంగారు ఆభరణాలు భద్రపరిచే గదివైపు వెళ్లే ప్రయత్నం చేయగా మేనేజర్ అడ్డుకున్నారు. దీంతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆవేశంలో సుత్తితో మేనేజర్పై దాడి చేసిన అతను, అడ్డుకోబోయిన క్యాషియర్పైనా దాడికి పాల్పడ్డాడు.
బాధితుల కేకలు విన్న స్థానికులు వెంటనే స్పందించి నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో మేనేజర్, క్యాషియర్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించబడ్డారు. కంచరపాలెం పోలీసులు నిందితుడు రవికుమార్ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















