సీబీఎస్ఈ 12వ తరగతి కామర్స్ విభాగంలో తొలుత 95.2 శాతం మార్కులు సాధించిన ఝార్ఖండ్కు చెందిన అవని కేజ్రీవాల్ అనే విద్యార్థినికి పునర్మూల్యాంకనం తర్వాత 100 శాతం మార్కులు వచ్చిన ఘటన చర్చనీయాంశంగా మారింది. మొత్తం 500 మార్కులకు గాను పూర్తి మార్కులు సాధించి సీబీఎస్ఈ 12వ తరగతిలో సంపూర్ణ స్కోరు సాధించిన ఏకైక విద్యార్థినిగా అవని నిలిచింది.
ఆంగ్లంలో 100కు 81 మార్కులు రావడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమె, ఇంగ్లీష్ సహా పలు సబ్జెక్టులకు రీ-వాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం వచ్చిన ఫలితాల్లో ఆమె మార్కులు పెరిగి 100 శాతానికి చేరడంతో కామర్స్ విభాగంలో జాతీయ టాపర్గా అవని నిలిచారు.
అదేవిధంగా ఆదిత్య మిశ్ర అనే మరో విద్యార్థికి కూడా రీ-వాల్యుయేషన్ తర్వాత మార్కులు పెరిగాయి. తొలుత 99.2 శాతం ఉన్న ఆయన స్కోరు 99.6 శాతానికి చేరింది. కాన్పూర్కు చెందిన సోనాక్షీ గోయల్తో కలిసి సైన్స్ విభాగంలో ఆదిత్య జాతీయ టాపర్గా నిలిచాడు.
ఈ మార్పులు విద్యార్థుల ప్రతిభను మళ్లీ గుర్తించినట్లు ఒకవైపు అభినందనలు అందుతున్నప్పటికీ, మరోవైపు ఆన్స్క్రీన్ మార్కింగ్ (OSM) విధానంలో జరిగిన తప్పిదాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంకా అనేక మంది విద్యార్థులు అన్యాయానికి గురై ఉండవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల విడుదలైన రీ-వాల్యుయేషన్ ఫలితాలపై కూడా పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తూ, మార్కింగ్ ప్రక్రియలో మరింత పారదర్శకత అవసరమని కోరుతున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















