తెలంగాణలో పదవ తరగతి పరీక్షల నిర్వహణలో తీవ్ర వివాదం తలెత్తింది. కూకట్పల్లి ప్రాంతంలోని న్యూ ఎరా స్కూల్లో చదువుతున్న సుమారు 80 మంది విద్యార్థులకు అదే పాఠశాలలో పరీక్షా కేంద్రం కేటాయించినట్లు సమాచారం. సాధారణంగా పరీక్షల పారదర్శకత కోసం విద్యార్థులకు ఇతర పాఠశాలల్లో పరీక్షా కేంద్రాలు కేటాయిస్తారు. అయితే ఈ ఘటనలో అదే స్కూల్లోనే పరీక్షలు నిర్వహించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ విషయం బయటికి రాకుండా డీఈవో (జిల్లా విద్యాశాఖ అధికారి) రహస్యంగా ఉంచారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే ఈ వ్యవహారం గురించి ఎవరికి తెలియకుండా ఉండేందుకు విద్యార్థులు తమ హాల్ టికెట్లను ఎవరికి చూపించకూడదని స్కూల్ యాజమాన్యం ఆదేశించినట్లు సమాచారం. దీనితో ఈ ఘటన మరింత వివాదాస్పదంగా మారింది.
కొంతమంది తల్లిదండ్రులు, విద్యా వర్గాలు ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తున్నారు. మార్కులు పెంచేందుకు కొందరు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు అధికారులతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్తుతో సంబంధం ఉన్న ఈ పరీక్షల్లో ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాలని వారు కోరుతున్నారు.
ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టాలని తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత ఉండాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews Business BusinessNews ChandrababuNaidu Chandrababu naidu CricketNews CrimeNews Entertainment EntertainmentNews Geopolitics Government HealthyLifestyle India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate NewsUpdates PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews SportsNews Tdp Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood WorldNews



















