ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

వేసవి వేడి ,యుద్ధ ప్రభావం…నీటి సీసాల ధరలధరలు పెరగనున్నాయా?

March 13, 2026
in Business News, News
0
వేసవి వేడి ,యుద్ధ ప్రభావం…నీటి సీసాల ధరలధరలు పెరగనున్నాయా?
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఇరాన్‌–అమెరికా, ఇజ్రాయెల్‌ మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేస్తుండగా, దాని ప్రభావం భారతదేశంలో సాధారణ ప్రజలపై కూడా కనిపిస్తోంది. ఇప్పటికే వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల కొరత కారణంగా హోటళ్లు, మెస్‌లు, క్విక్‌ సర్వీస్‌ రెస్టారెంట్లు, హాస్టళ్ల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గృహ వినియోగ వంట గ్యాస్‌ ధరలు కూడా పెరిగాయి. పెట్రోల్‌, డీజిల్‌ కొరత ఏర్పడవచ్చనే భయంతో కొందరు వాహనదారులు ముందుగానే ట్యాంకులను నింపేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు తాగునీటి సీసాల ధరలపైనా ప్రభావం పడుతుందనే సమాచారం వెలువడుతోంది. వేసవి తీవ్రత పెరుగుతున్న సమయంలో నీటి సీసాల ధరలు పెరగడం వినియోగదారులకు మరో భారంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశంలో ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ మార్కెట్‌ దాదాపు 5 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.46,000 కోట్లు) విలువ కలిగి ఉందని అంచనా. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న బాటిల్‌ వాటర్‌ మార్కెట్లలో భారతదేశం కూడా ఒకటి.

ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం ప్లాస్టిక్‌ సీసాల తయారీలో ఉపయోగించే పాలిమర్‌ కొరత. పాలిమర్‌ ముడిచమురు నుంచి తయారవుతుంది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో పాలిమర్‌ ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. ఫలితంగా సీసాల తయారీలో ఉపయోగించే ముడి పదార్థం ధర 50 శాతం పెరిగి కిలోకు సుమారు రూ.170కు చేరినట్లు సమాచారం. అంతేకాకుండా బాటిల్‌ మూతల ధర కూడా భారీగా పెరిగి ఒక్కో మూత రూ.0.45 వరకు చేరింది. ప్యాకింగ్‌ బాక్సులు, లేబుల్స్‌, టేపులు వంటి ఇతర ప్యాకేజింగ్‌ వస్తువుల ధరలు కూడా పెరగడంతో మొత్తం ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరిగిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం పెద్ద కంపెనీలు పెరిగిన ముడి పదార్థాల ఖర్చును తమవంతుగా భరిస్తూ రిటెయిల్‌ ధరలను యథాతథంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే దేశవ్యాప్తంగా సీసాలు తయారు చేసే దాదాపు 2000 చిన్న, మధ్య తరహా సంస్థలు తమ రీసెల్లర్లకు బాటిల్‌కు సుమారు ఒక రూపాయి వరకు (దాదాపు 5%) ధర పెంచినట్లు తెలుస్తోంది. ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ మ్యానుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ ప్రకారం, రాబోయే రోజుల్లో ధరలు మరో 10 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం వినియోగదారులు ఒక లీటర్‌ నీటి సీసాకు రూ.15 నుంచి రూ.20 వరకు చెల్లిస్తున్నారు. సీసా తయారీ ఖర్చు పెరగడం వల్ల రాబోయే నాలుగు నుంచి ఐదు రోజుల్లో మార్కెట్‌లో అసలు ధర ఎంత పెరుగుతుందో స్పష్టమవుతుందని అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ అపూర్వ దోషి తెలిపారు.

ఇంకొకవైపు, దేశంలో స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో లేకపోవడం కూడా సీసా నీటిపై ఆధారపడే పరిస్థితిని పెంచుతోంది. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో భూగర్భ జలాలు, పైపులైన్‌ ద్వారా వచ్చే నీటిలో దాదాపు 70 శాతం వరకు కలుషితమై ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు వెళ్లినప్పుడు బాటిల్‌ నీటిపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. బిస్లరీ, కిన్లీ, ఆక్వాఫినా, రిలయన్స్‌, టాటా వంటి పెద్ద కంపెనీలు ఈ విపణిలో ఆధిపత్యం కోసం పోటీ పడుతున్నాయి.

ప్రీమియం మినరల్‌ వాటర్‌ రంగం కూడా ఈ పరిస్థితులతో ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మొత్తం సీసా నీటి మార్కెట్‌లో నేచురల్‌ మినరల్‌ వాటర్‌ విభాగం విలువ దాదాపు 400 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.3680 కోట్లు). ప్రధానంగా ధనవంతులు వినియోగించే ఈ విభాగం గత కొన్నేళ్లలో వేగంగా పెరిగింది. యూరోమానిటర్‌ నివేదిక ప్రకారం 2021లో కేవలం 1 శాతం మాత్రమే ఉన్న ప్రీమియం వాటర్‌ విభాగం వాటా గత ఏడాదికి 8 శాతానికి పెరిగింది. అయితే ముడి పదార్థాల ధరలు పెరగడంతో ఈ రంగం కూడా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కొన్ని కంపెనీలు రీసెల్లర్ల ధరలను 18 శాతం వరకు పెంచాల్సి వచ్చినట్లు చెబుతున్నాయి. వినియోగదారులను కోల్పోకూడదనే ఉద్దేశంతో తయారుదారులు 40 నుంచి 50 శాతం వరకు అదనపు ఖర్చును తామే భరిస్తున్నారని పరిశ్రమ వర్గాలు వెల్లడిస్తున్నాయి. వేసవి కాలం ప్రారంభానికి ముందు పానీయాల పరిశ్రమకు ఇది పెద్ద సవాల్‌గా మారిందని, ప్యాకేజింగ్‌ మరియు ఉత్పత్తి వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత విక్రయ ధరలతో కొనసాగడం కష్టమవుతోందని సంస్థలు పేర్కొంటున్నాయి.

Andhra pradesh Andhrapradesh APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews

Tags: beverage industry challengesbisleri kinley aquafinabottled water price hikeBreaking newsBusinessConsumer Price RiseCrude Oil Price Risedrinking water demandglobal oil impactindia bottled water marketIndia newsiran israel conflict impactmarket price trendsNewsnews updatepackaged drinking water marketplastic bottle cost increasepolymer shortageretail price increaserising packaging costsShivaSakthi Mediashivasakthi netshivasakthi newssummer demand for waterSummer Heattelugu newswar impact on priceswater bottle prices
ShareTweetSend
Previous Post

హర్మూజ్‌ జలసంధి వద్ద నిలిచిన ఎల్పీజీ ట్యాంకర్లు.. ఇరాన్‌తో భారత్‌ చర్చలు

Next Post

ఐఆర్‌సీటీసీ సౌత్‌ సెంట్రల్‌ జోన్‌లో 43 హాస్పిటాలిటీ మానిటర్‌ పోస్టులు

Related Posts

కోపం వచ్చిన కోతులు
Telugu Stories

కోపం వచ్చిన కోతులు

April 27, 2026
లాభాలతో ముగిసిన మార్కెట్.. 24K పైకి నిఫ్టీ
Stock Market News

లాభాలతో ముగిసిన మార్కెట్.. 24K పైకి నిఫ్టీ

April 27, 2026
రక్తహీనత ప్రభావం మెదడుపై ఎలా ఉంటుంది?
Health

రక్తహీనత ప్రభావం మెదడుపై ఎలా ఉంటుంది?

April 27, 2026
పెళ్లికాని వారిలో క్యాన్సర్ ముప్పు పెరుగుతుందా?
Health

పెళ్లికాని వారిలో క్యాన్సర్ ముప్పు పెరుగుతుందా?

April 27, 2026
ఖాళీ కడుపుతో వాకింగ్ చేసే ముందు జాగ్రత్తలు తప్పనిసరి
Health

ఖాళీ కడుపుతో వాకింగ్ చేసే ముందు జాగ్రత్తలు తప్పనిసరి

April 27, 2026
రాష్ట్రంలో స్వీయ జనగణన ప్రారంభం..
Telangana News

రాష్ట్రంలో స్వీయ జనగణన ప్రారంభం..

April 27, 2026
Next Post
భారత రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌కు చెందిన

ఐఆర్‌సీటీసీ సౌత్‌ సెంట్రల్‌ జోన్‌లో 43 హాస్పిటాలిటీ మానిటర్‌ పోస్టులు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

April 27, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 27 ఏప్రిల్ 2026 (సోమవారం)

పంచాంగం: 27 ఏప్రిల్ 2026 (సోమవారం)

April 27, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

1
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
కోపం వచ్చిన కోతులు

కోపం వచ్చిన కోతులు

April 27, 2026
లాభాలతో ముగిసిన మార్కెట్.. 24K పైకి నిఫ్టీ

లాభాలతో ముగిసిన మార్కెట్.. 24K పైకి నిఫ్టీ

April 27, 2026
రక్తహీనత ప్రభావం మెదడుపై ఎలా ఉంటుంది?

రక్తహీనత ప్రభావం మెదడుపై ఎలా ఉంటుంది?

April 27, 2026
పెళ్లికాని వారిలో క్యాన్సర్ ముప్పు పెరుగుతుందా?

పెళ్లికాని వారిలో క్యాన్సర్ ముప్పు పెరుగుతుందా?

April 27, 2026

Recent News

కోపం వచ్చిన కోతులు

కోపం వచ్చిన కోతులు

April 27, 2026
లాభాలతో ముగిసిన మార్కెట్.. 24K పైకి నిఫ్టీ

లాభాలతో ముగిసిన మార్కెట్.. 24K పైకి నిఫ్టీ

April 27, 2026
రక్తహీనత ప్రభావం మెదడుపై ఎలా ఉంటుంది?

రక్తహీనత ప్రభావం మెదడుపై ఎలా ఉంటుంది?

April 27, 2026
పెళ్లికాని వారిలో క్యాన్సర్ ముప్పు పెరుగుతుందా?

పెళ్లికాని వారిలో క్యాన్సర్ ముప్పు పెరుగుతుందా?

April 27, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

కోపం వచ్చిన కోతులు

కోపం వచ్చిన కోతులు

April 27, 2026
లాభాలతో ముగిసిన మార్కెట్.. 24K పైకి నిఫ్టీ

లాభాలతో ముగిసిన మార్కెట్.. 24K పైకి నిఫ్టీ

April 27, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.