యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ప్రతిభను బీసీసీఐ తొలిసారిగా విజయవాడలోనే గుర్తించిందని మాజీ క్రికెటర్, భారత జట్టు మాజీ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ తెలిపారు. 2024 అండర్-19 ప్రపంచకప్కు ముందు విజయవాడలో జరిగిన క్వాడ్రపుల్ సిరీస్లో ఇండియా బి జట్టు తరఫున వైభవ్ టాప్ స్కోరర్గా నిలిచాడని వెల్లడించారు. అప్పట్లోనే అతడి ఆటతీరును గమనించామని, ఇప్పటికీ అదే దూకుడుతో ఆడుతున్నప్పటికీ పరిస్థితులకు అనుగుణంగా తన ఆటను మార్చుకోవడంలో మంచి పరిణతి సాధించాడని లక్ష్మణ్ ప్రశంసించారు.
ఇంగ్లాండ్తో సిరీస్లో కొంత ఇబ్బంది పడిన వైభవ్.. జింబాబ్వేపై అద్భుతంగా రాణించి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. ముఖ్యంగా మూడో టీ20లో మందకొడి పిచ్పై జింబాబ్వే బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ తొందరపడకుండా బ్యాటింగ్ చేసిన విధానం తనను ఆకట్టుకుందని లక్ష్మణ్ తెలిపారు.
వైభవ్ ఆటలో ప్రస్తుతం కనిపిస్తున్న ఏకైక మెరుగుదల అవసరం ఫిట్నెస్ అని లక్ష్మణ్ పేర్కొన్నారు. అతడు ఇంకా చిన్న వయసులోనే ఉన్నప్పటికీ, భవిష్యత్తులో మరింత ఫిట్గా ఉండటంపై దృష్టి పెట్టాలని సూచించారు. మూడో టీ20లో క్యాచ్ పట్టే ప్రయత్నంలో గాయపడినా మైదానం వీడేందుకు వైభవ్ ఆసక్తి చూపలేదని, ఆటపట్ల అతడికి ఉన్న అంకితభావానికి ఇది నిదర్శనమని లక్ష్మణ్ కొనియాడారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















