గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను ‘స్వర్ణ గ్రామ’, ‘స్వర్ణ వార్డు’లుగా మార్చే చట్ట సవరణకు శాసనసభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థలో కీలక మార్పులకు నాంది పలికింది. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలను సాధించేందుకు గ్రామస్థాయి పరిపాలనను మరింత సమర్థవంతంగా మార్చడమే ఈ నిర్ణయానికి కారణమని ప్రభుత్వం స్పష్టం చేసింది.
మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అసెంబ్లీలో మాట్లాడుతూ, గ్రామ, వార్డు స్థాయిలో ప్రజలకు అందించే సేవలను వేగవంతం చేసి, పారదర్శకతను పెంచడమే లక్ష్యమన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో చేరేలా పరిపాలనను బలోపేతం చేస్తామని తెలిపారు.
ఇక స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డుల సిబ్బందికి పదోన్నతులు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని పెంచి, సేవల నాణ్యతను మెరుగుపరచడమే ఈ చర్యల ఉద్దేశమని చెప్పారు. సచివాలయ వ్యవస్థను మరింత సమర్థంగా పనిచేసేలా తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు.
ఈ మార్పులతో గ్రామస్థాయి పరిపాలనలో ప్రజలకు మరింత సౌలభ్యం కలుగుతుందని, ప్రభుత్వ సేవలు వేగంగా అందుబాటులోకి వస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 దిశగా తీసుకున్న ఈ అడుగు రాష్ట్ర అభివృద్ధికి మైలురాయిగా నిలవనుందని భావిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















