మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని దాని అసలైన స్ఫూర్తితో అమలు చేసే సమయం ఆసన్నమైందని ప్రధాని Narendra Modi పేర్కొన్నారు. 2029 లోక్సభ, శాసనసభ ఎన్నికలను మహిళా రిజర్వేషన్లతోనే నిర్వహించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుదామని ఆయన పిలుపునిచ్చారు.ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి “నారీ శక్తి వందన్ అధినియం”కు సంబంధించిన అవసరమైన సవరణ బిల్లులను ఆమోదించాలని మోదీ కోరారు. ఈ మేరకు ఆయన లోక్సభ, రాజ్యసభలోని వివిధ పార్టీల నేతలకు లేఖ రాశారు.
ఈ కీలక సవరణలపై చర్చించేందుకు ఈ నెల 16 నుంచి మూడు రోజుల పాటు పార్లమెంటు ఉభయ సభల ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. 2029 నుంచి మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తే ప్రజాస్వామ్య సంస్థలకు మరింత బలం చేకూరుతుందని మోదీ అభిప్రాయపడ్డారు. దేశ జనాభాలో సగం ఉన్న మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని పెంచే దిశగా ఇది చారిత్రాత్మక అడుగని పేర్కొన్నారు.ఇదిలా ఉండగా, ప్రత్యేక పార్లమెంటు సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలంటూ తమ ఎంపీలకు Bharatiya Janata Party విప్ జారీ చేసింది.
మహిళా రిజర్వేషన్ల అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు మోదీ సోమవారం దిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగే కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఉద్దేశించి ఆయన ఈ విషయంపై కీలక సందేశం ఇవ్వనున్నట్లు సమాచారం.దేశ మహిళల అభ్యున్నతికి, రాజకీయ సాధికారతకు నాంది పలికే ఈ చట్టంపై పార్లమెంటులో ఏకగ్రీవ చర్చ జరగాలని మోదీ ఆకాంక్షించారు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews



















