షేర్ల ట్రేడింగ్కు సంబంధించి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కీలక సూచనలు చేసినట్లు సమాచారం. క్లోజింగ్ ఆక్షన్ సెషన్ (సీఏఎస్) ప్రారంభానికి ముందు మధ్యాహ్నం 3:15 గంటల నుంచి 3:20 గంటల వరకు ఉండే ఐదు నిమిషాల వ్యవధిలోనూ పెట్టుబడిదారుల నుంచి ఆర్డర్లు స్వీకరించాలని స్టాక్ బ్రోకర్లను ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ మార్పుకు అనుగుణంగా తమ ట్రేడింగ్ వ్యవస్థల్లో అవసరమైన సాంకేతిక మార్పులు చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం షేర్ల ట్రేడింగ్లో క్లోజింగ్ ఆక్షన్ సెషన్ ప్రక్రియ మధ్యాహ్నం 3:15 గంటల నుంచి 3:35 గంటల వరకు కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఎఫ్ అండ్ ఓ కాంట్రాక్టులు అమలయ్యే షేర్లకు ముగింపు ధరను నిర్ణయిస్తారు.
సీఏఎస్ విధానం ఎలా ఉంటుంది?
ట్రేడింగ్ ముగింపు దశలో నిర్ణీత సమయంలో ఆక్షన్ తరహా ఆర్డర్ మ్యాచింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఈ సమయంలో కొనుగోలు, అమ్మకాల ఆర్డర్లు వెంటనే అమలు కాకుండా ఒక చోట సమీకరించబడతాయి. అనంతరం ఏ ధర వద్ద అత్యధిక సంఖ్యలో షేర్లకు కొనుగోలు, అమ్మకాల ఆర్డర్లు సరిపోలుతాయో.. ఆ ధరను సంబంధిత షేరుకు ముగింపు ధరగా నిర్ణయిస్తారు.
సాధారణంగా 3:30 గంటల నుంచి 3:35 గంటల మధ్య ఈ ప్రక్రియ ద్వారా షేర్ల ముగింపు ధర ఖరారవుతుంది. తాజా మార్పుతో సీఏఎస్ ప్రారంభానికి ముందు ఐదు నిమిషాల వ్యవధిలోనూ ఆర్డర్లు పెట్టుకునే అవకాశం పెట్టుబడిదారులకు అందుబాటులోకి రానుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















