ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ పాలనలో AI, Google వంటి ఆధునిక సాంకేతికతలు కీలక పాత్ర పోషించనున్నాయి అని సీఎం Chandrababu Naidu స్పష్టం చేశారు. విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకుని టెక్నాలజీ, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు సృష్టించే స్పష్టమైన విజన్ను ఆయన వెల్లడించారAI ఆధారిత పాలన ద్వారా సేవలు మరింత వేగంగా, పారదర్శకంగా ప్రజలకు నేరుగా అందించవచ్చని చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వ వ్యవస్థల్లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ను వేగవంతం చేసి, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యమని చెప్పారు.
రాబోయే మూడు సంవత్సరాల్లో అమరావతిని దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా (Most Liveable City) తీర్చిదిద్దుతామని సీఎం ప్రకటించారు. పాలనలో AI, క్వాంటం కంప్యూటింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతలను జోడించి, ఆరోగ్యం, విద్య, పట్టణాభివృద్ధి, పరిపాలన సేవలను మరింత సమర్థవంతంగా మార్చనున్నట్లు తెలిపారు.
విశాఖపట్నం కేంద్రంగా Google వంటి గ్లోబల్ సంస్థల పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, MSME రంగం ద్వారా విస్తృత స్థాయిలో ఉపాధి కల్పన లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని చంద్రబాబు వివరించారు. టెక్నాలజీ ఆధారిత స్టార్టప్ ఎకోసిస్టమ్ను బలోపేతం చేసి యువతకు కొత్త అవకాశాలు కల్పించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా చెప్పారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















