కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్విమ్స్ ఆసుపత్రి అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చామని తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు డాక్టర్ జగదీశ్ను తిరుపతి జిల్లా స్విమ్స్ డైరెక్టర్గా నియమించినట్లు చెప్పారు.
గురువారం డాక్టర్ జగదీశ్ స్విమ్స్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ నాయుడు మాట్లాడుతూ.. జగదీశ్కు వైద్య రంగంలో అపారమైన అనుభవంతోపాటు మంచి పేరు, దూరదృష్టి ఉన్నాయని పేర్కొన్నారు. దేశం గర్వించదగిన వైద్యుల్లో ఆయన ఒకరని కొనియాడారు.
స్విమ్స్, బర్డ్తోపాటు తితిదే ఆధ్వర్యంలోని ఇతర వైద్యశాలల్లోనూ ప్రజలకు మరింత మెరుగైన వైద్య సదుపాయాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని బీఆర్ నాయుడు తెలిపారు. వైద్య సేవల విస్తరణతో పాటు ఆధునిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు.
తిరుపతిలో చిన్నారులకు అత్యాధునిక వైద్యం అందించేందుకు చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. తితిదే వైద్య సంస్థలను మరింత బలోపేతం చేసి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యమన్నారు.
అనంతరం డాక్టర్ జగదీశ్ మాట్లాడుతూ.. బీఆర్ నాయుడు ఉత్తర్వులతో బర్డ్, స్విమ్స్ ఆసుపత్రుల డైరెక్టర్గా పనిచేసే అవకాశం లభించడం సంతోషంగా ఉందన్నారు. తనపై ఉంచిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించి వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















